Thursday, September 24, 2009

snehitudu

 అది నేను ముడో తరగతి చదివేరోజులు. ఖమ్మం జిల్లాలో ఉండేవాళ్ళం. భద్రాచలానికి దగ్గరే అడవి ప్రాంతంలగుండేది .రొండు ఇళ్ళు కలిపి జంటగా ఉండేవి ,మళ్ళికొంచందూరంలోరొండో ఇల్లు ,ప్రహరీబదులు ,రేగు, జామ ,సీతాఫలం  చెట్లు ఉండేవి .ఎలా వచ్చేవో ,మా పెరట్లోకి నెమళ్ళు ,లేళ్ళు వస్తుండేవి .ఇంటి ముందు పెద్ద మైదానంలా కాళి స్థలం ఉండేది .నాన్నగారి బదిలీవలన అన్ని వూర్లు తిరగాల్సి వచ్చేది . ఊరు మాత్రం నాకు చాలానచ్చింది .కొత్తగా స్కూల్ లో జాయిన్ అయ్యాను,నా తో పాటు పెద్ద తమ్ముడిని (బాబోయ్ !వాడు మహా పెంకి వాడు లెండి)స్కూల్లో జాయిన్ చేసేరు .వాడేమో అమ్మకి ముద్దుల కొడుకు స్కూల్కి వెళ్లనని రోజు పేచి ....రిక్షాలోంచి దూకేసి పరుగు పెట్టేవాడు .రిక్షావాడు తమ్ముడు వెనకాల పరుగు,తమ్ముడు తనకు వచ్చిన భాష లో అతన్ని తిట్టటం ,కొట్టడం ,ఎలాగోలా స్కూల్కి తీసుకెళ్లడం లేట్ అవటంతో నన్ను బెంచి మీద నిలబెట్టేవారు .అలా చాలసార్లునిలబడాల్సివచ్చేది. నా చదువు సంగతి దేవుడెరుగు వాణ్ని అదుపు చెయ్యటానికే సమయం గడిచిపోయేది....ఇలా వాడి తో నా పాట్లు చాలానే ఉన్నాయ్లెండి.





ఊరికొచ్చిన కొద్దిపాటి రోజులలోనే ఇళ్ళ పక్కపిల్లలందరం  పెద్ద గ్యాంగ్ గా తయారయ్యాం .కాని వారందిరిలో పక్కింటి బాబ్జీ ..కుడి పక్కింటిలో సాగర్ తో ఎక్కువ ఆడుకునేదాన్ని.అందరం కలిసామంటే ఇంక మా అల్లరికి , ఆటలకి కొదవే లేదు .ఎన్నాటలో ......దాగుడు మూతలు ,కలర్ కలర్,నేలా బందా ,మా తా ఉత్తరం ,...........ఇలా ఎన్నో.ఎప్పుడైనా వర్షం కురిసి వెరిసిందంటే చాలు మా గ్యాంగ్ అంటా మైదానంలో కి చేరి ..... మట్టి లో ఎన్నో బొమ్మలు గీసేవాళ్ళం .అందరికంటే సాగర్ అద్భుతంగా గీసేవాడు.వాడు బాగా గీస్తాడన్న్న అసూయతో సాగర్ చెల్లి శాంతి దాన్ని తుడిపేసేది.దానితో కోపం వచ్చి సాగర్ శాంతి ని బాగా తిట్టాడు.అది ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది .మర్నాడు సాగర్ చొక్కా లేకుండా తిరగడం గమనించా . ఏమి అయ్యిందా ఆరా తీస్తే .........శాంతి వెళ్లి వాలన్నయ్య మీద చాడీలు చెప్పింది,దాని పర్యవసానం తెల్లటి వీపు   మీద ఎర్రటి ,వెడల్పాటి వాతలు,దానిమీద రాసిన ఆయింట్మెంట్ .సాగర్ వాళ్ళ  నాన్నగారు శాంతి ఏమిచెప్పినా నమ్మేసి ఇలా కొడతాడంట .నాకు మా ఫ్రెండ్స్ అందరికి చాల బాద వేసింది ,అందులో మా ఆటలకు బ్రేక్ ,అప్పటినుంచి శాంతి అంటే మాకు కోపం .అప్పుడప్పుడు సాగర్ మాకు అలాగే దర్సనం ఇస్తుండేవాడు .వాళ్ల నాన్నగారు పెద్ద ఆఫీసర్ , చూస్తాకి మంచివారి లాగా   వుండేవారు .మేమందరం వాళ్ల ఇంటికి వెళ్లి నప్పుడు వాళ్ల అమ్మ మమ్మల్ని పలకరించి తినడానికి స్వీట్స్ ఇస్తుండేవారు .సాగర్ అల్లరిచేసేవాడు కాదు,బాగా చదేవేవాడు .బాబ్జికి ,నాకు సాగర్ మీద జాలి ఉండేది.నెక్స్ట్ ఇయర్ బదిలిమీద వేరేఉరు వేల్లిపోయము .ఇప్పటికి ఆరోజులు గుర్తుకు వస్తుంటాయి ,ఎవరయినా వాళ్ల పిల్లలని కొడుతుంటే చాల కోపమువస్తుంది ,బాదవేస్తుంది వెళ్లి అడ్డుకుంటాను .




చాల మంది భార్యమీద కోపాన్ని ,భర్త మీద కోపాన్నిపిల్లలమీద చూపిస్తారు .మా పెద్దమ్మగారి అబ్బాయి (అన్నా)వాళ్ల ఆవిడా మీద కోపం వస్తే భయంకరంగా పిల్లలని కొట్టేవాడు ,వాళ్ల పిల్లలయినంత మాత్రాన కొట్టటానికి ఎవరికి హక్కు లేదు .అల్లాంటి వాళ్ళను దేముడే మార్చాలేమో !

Wednesday, September 23, 2009

ఈ తరం తల్లులు

"మమ్మీ ,నువ్వు బతికే వున్నావా ?"భయంగా చూసేరు వంశి ,కృష్ణ .

"అదేంటిరా !అల చూస్తున్నారు ,మీ అమ్మనిరా !"స్కూల్ కి వచ్చి తన పిల్లలని చూసి బోరున ఏడ్చింది మాధవి ."నువ్వు చచ్చి పోయావని డాడి చెప్పారు !"ఇంక అనుమానంగానే చూస్తూ చెప్పేరు .పిల్లలిద్దరిని దగరకు తీసుకుని ,తను చని పోలేదని ,బ్రతికే ఉన్నానని వారితోకొంచం సేపు గడిపి వెళ్ళిపోయింది .

మర్నాడు మాధవి ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరకు వచ్చింది ,భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవల వలన ఇంటిలోనుంచి వేల్లిపోమ్మనాడు ,పిల్లలు స్కూల్కి వెళ్ళిన సమయములో నన్ను బయటకు నేట్టేసేడు .అప్పటినుంచి నా పిల్లలని చూసుకునే అవకాసం లేకుండా పోయింది .పిల్లలని చుస్తకి వీలేదు అంటున్నాడు , నా పిల్లలు నాకు కావాలి అని చాల ఏడ్చింది .పాపం అన్పించింది ,తను చుస్తకి చాల చక్కగా ఉంది ,వయసు ముడుపదులు ఉండవచ్చు .ఆమె భర్తా పోలీస్ డిపార్టుమెంటు అంట ,డివోర్స్ కి కూడా అప్లై చేసేదంట.

ఇది మాధవి గా !

ఇలాంటి కధలు రోజుకి ఎన్నో , డీ వీ చట్టం వచ్చాక మహిళలు దైర్యంగా బయటకి వచ్చి సహాయము కోరుతున్నారు ,మగ మహారాజులు విడాకులు కావలి అంటున్నారు . మధ్య విడాకులు ఎక్కువయ్యాయి .పిల్లల సంగతి ఆలోచించేదేవరు ?ఎవరికి వాళ్ళు పంతాలు ,పట్టింపులు .మన సంసృతి కూడా మారిపోతుంది.

సరే ఇంతకి మాధవి బాధని అర్ధం చేసుకుని ,ఆమె భర్తా గారిని పెలిపించడం జరిగింది .'తల్లి పిల్లలని వేరు చేయడం నేరము మీకు ఎంత హక్కు ఉందొ ,ఆమెకు అంతే హక్కు ఉంటుంది ,ఆమె పిల్లలని చూసుకోవడానికి అవకసమివ్వండి ,తల్లికి ఎంత భాద ఉంటుందో మీకు తెలియదు 'అని అతనితో చెప్పడం జరిగింది .

నేను చెప్పేది కూడా వినండి అని అతని కథ చెప్పడం మొదలు పెట్టేడు ........వారిది ముచాటైన చిన్న సంసారం తొమిది , ఎనిమిది వయసున్న ఇద్దరు కొడుకులు .సొంత ఇల్లు ,ఆర్థిక ఇబ్బందులు లేవు ,ఇద్దరు డిగ్రీ చదివినవాళ్ళు ,అతనిది గవర్నమెంట్ జాబు ,ఇంకేమిటి సమస్య ?

వీళ్ళకి గోపాలరావు గారు అనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారంట ,వల్ల అబ్బాయిmadhu ,మాధవి అయన ఇద్దరు చాల బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట .పండగలకి పబ్బాలకి రావడం,వెళ్ళడం . పరిచయం కాస్త మాధవి, మధు స్నేహం ఎక్కువయ్యింది .అది కాస్త ప్రేమగా మారింది ,ఇద్దరు విడిగా ఉండలేని పరిస్థితి !గొడవలు మొదలవడము ,ఇంటిలోనుంచి పంపించైయ్యడము జరిగింది .ఆమె కూడా భర్త ని పిల్లలని వదిలేసి ప్రేమ కోసం వెళ్ళిపోయింది .ఇప్పుడు పిల్లలు కవల్సివచ్చార ?అని తన బాదనంత వెల్ల గక్కడు .

ఆచర్యపోవడం మవంతయింది ,ఎంతో అవమానం తో తలదించుకుంది .ఆమె మీ చాల కోపంగా అన్పించింది .పిల్లలని నాదాలుగా చేసి ,ప్రేమ కోసం vellevariki ఏమని న్యాయం చెప్పాలి ......