Thursday, October 29, 2009

తోట కూర కథ



               నేను నా పనులతో బిజీగ ఉన్నాను.అమ్మ దగ్గరనుంచి ఫోన్ 'నేను చెప్పిన విషయం కనుక్కున్నావా ?'అని అమ్మ అడిగింది .'అయ్యో! కనుక్కోలేదు ,ఇప్పుడే కనుక్కుంటాను' అని చెప్పెను .మూడు రోజుల్లో అమ్మ  పుట్టినరోజు వస్తుంది ,ఆరోజు వృద్ద ఆశ్రమంలో భోజనాలు పెట్టించాలి అని .నాన్నగారు ,అమ్మ వారి పుట్టిన రోజున అల పెట్టించడం అలవాటు .నా పనులు పక్కన పెట్టి బుక్ చెయ్యడానికి  వెళ్ళాను.నెల ఆఖరువరకు అన్ని డేట్స్ బుక్ అయిపోయంట.వేరే ఓల్డ్ ఏజ్  హొమ్స్ కి ఫోన్ చేశా ,అక్కడ బుక్ అయిపోయంట .నెక్స్ట్ మంత్ అయితే ఇస్తామన్నారు(మనకి కావాల్సింది అక్టోబర్         పద్దెనిమిది)ముందేవెళ్లివుంటే బాగుండు  అనుకున్న,నాకేంతెలుసు  దాతలు ఎక్కువైపోయారని.ఒకవైపున మనుషుల్లో స్వార్ధం ఎక్కువైంది అనుకుంటున్నాము  కానీ  మానవత్వం కూడా పెరిగిందన్నమాట (మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ఎందుకు పెరుగుతున్నాయి?)

                                     అమ్మని నిరాసపరచడం  ఇష్టంలేక అన్ని చోట్ల కనుక్కున్న ,పోనీ అబ్సేర్వషన్ హోం లోఇస్తే! కనుక్కుందాం అనుకున్న,ఫోన్ చేస్తే వాళ్ళు ఓకే  అన్నారు . అమ్మకూడా ఒప్పుకుంది.


                                  పద్దెనిమిది సంవస్తసరాల వయసు లోపు పిల్లలు నేరం చేస్తే ఈ హోం లో ఉంచుతారు .వారిని కొట్టకుండా, తిట్టకుండా,బేడీలు వేయకుండా పోలీసులు సివిల్ డ్రెస్ లో హోమేకి తీసుకు వస్తారు .పోలీసులు కొట్టారని తెలిస్తే వారిమీద ఎక్షన్ తీసుకోవడం జరుగుతుంది .ప్రతి వారం ఒక రోజు అక్కడే కోర్ట్ నిర్వహిస్తారు .జడ్జి ,సైకాలజిస్ట్ ,సోషియలజిస్ట్,ఒక బెంచ్ గ కుర్చుని కేసు ని పరిశిలిస్తారు,బెయిల్ ఇస్తారు ,కేసు బట్టి కొంతమందికి బెయిల్ రాదు .నేరం రుజువైతే వారిని వైజాగ్ ,తిరుపతి ,హైదరాబాద్లో ఉన్న స్పెషల్ హోం కి పంపిస్తారు .అక్కడ వారికీ చదువు ఒకేషనల్ ట్రైనింగ్స్ఇస్తారు .కౌన్సిలింగ్ ద్వార వారిలో మార్పు తీసుకు రావడనికి ప్రయత్నిస్తారు . ఆరోజే నేను వెళ్లి ఎంతమంది ఉన్నారో చూసి వారికీ ఏమి స్పెషల్ కావాలో అడిగి తెలుసుకిని ఆర్డర్ చేసి వచ్చెను .                                                                                     
             అమ్మపుట్టినరోజునా ,మాకు అమ్మచేసినలడ్డులు ,సున్నుండలు ,గారెలు,సేమ్యా ,పంపించింది మా సిస్టర్స్, బ్రదర్స్ వేరే ప్లేసెస్లో ఉన్నారు .నేను మాత్రం అమ్మవాళ్ళ కి దగ్గరలోనే,వాళ్ళ కాలనీలోనే ఉంటున్నాము .మా అత్తా గారువాళ్ళు ఆ కాలనీలోనే ఉంటారు .ఎవరికి ఏ అవసరం వచ్చిన వెంటనే నాకు ఫోన్ వస్తుంది .వాళ్లపనులు చూసేక న పనుల్లోకి వెళతాను .

                     అమ్మని తీసుకుని అబ్సేర్వషన్  హోం కి వెళ్ళెను .అది  రెం డు అంతస్తుల ఇండిపెండెంట్ హౌస్ ,గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీసు ,స్టాఫ్ ఉంటారు .పైన పిల్లలు ,బయటకు వెళ్ళకుండా అంత సెక్యూరిటీ ఉంటుంది .పిల్లలందరూ యునిఫోం లో ఉన్నారు .మాకోసం ఎదురు చూస్తున్నారు.ప్రోబెస్షనరీ ఆఫీసర్ వచ్చి విష్ చేసి ఆహ్వానించేరు .పిల్లలందరూ వచ్చి వరుసగా కూర్చున్నారు.మమ్మల్నిపరిచయంచేసేరు,దాదాపుపాతికమందిదాకఉన్నారు .అందరు ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు ,వాళ్ళందరిని పరిచయం చేసుకోమంటే సిగ్గ్గుపడుతూ తలవంచుకున్నారు దగ్గరకు పిలిచి భుజం చుట్టూ చేతులు వేసి హోం లో ఎలా చూస్తున్నారు ,ప్రోబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను ,దానితో  వాళ్ళు ఫ్రీ అయిపోయి అన్ని కబుర్లుచెప్పేరు ,అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నరు .నలుగురు మాత్రం అనాధలు ,మిగతా వారికీ తల్లి దండ్రులు ఉన్నారు .ఇంటిలో సరిగ్గా చదవట్లేదని తిడితే కోపమొచ్చి వచ్చేసినవాళ్ళు ,తండ్రి బాగా తాగి ,కొట్టి ఇంటిలో గొడవ చేస్తుంటే ఉండలేక వచ్చేసిన వాళ్ళు ,చెడు స్నేహితుల వల్ల వచ్చేసినవాళ్ళు కొందరు ,చిన్నప్పుడే పనిలో పెడితే ఇష్టం లేకే పారిపోయి వచ్చినవాళ్లు .వీళ్ళందరూ గాంగ్ చేతుల్లోపడిదొంగతనాలు చెయ్యడం,సొంతంగా డబ్బు అవసరమొచ్చి కొంతమంది , డ్రగ్స్ కోసం కొంతమంది  ,వీళ్లు ఎక్కువగా తీసుకునే డ్రగ్స్, వైట్నర్ సోలుషన్ ,ఖైని ,ఇంకా ఏవో పేర్లు చెప్పేరు.వాళ్ళ  పేరెంట్స్ గురించి చెప్పుత చాలమంది ఏడ్చేరు .నేను వాళ్ళందరికీ గ్రూప్ కౌన్సిలింగ్ ఇచ్చెను. అందరిలో చిన్నవాడు సందీప్ ,వయసు పన్నెండు  ,చిలకలూరిపేట .దగ్గరకు పెలిచాను ,ఫ్రెండ్లీగా మాట్లాడ ,అతని పైన ఇదు కేసులు ఉన్నాయంట .'ఎందుకు దొంగతనం  చేసేవు '?అని అడిగితె !'పక్కింటి అన్న సినిమాకి తీసుకువెళతాను అని చెప్పి వేరే  వూరు తీసుకు వెళ్లి దొంగతనం చేయిన్చేడు'అని చెప్పేడు  .ఇంటికి వెళ్లి పోతాను పంపించెయ్యండి అనిఎద్చేడు.చాలచక్కగాఉన్నాడు ,వాడినిచుస్తేజాలి    వేసింది .వాడిని చూసి అమ్మ బాధపడింది .'తల్లి దండ్రుల పెంపక లోపం వలెనే వీరి బంగారు భవిష్యత్ నాసనమయ్యింది .పసి మొగ్గలు ,లేత మొక్క ఎటు వంచితే అటు వంగుతుంది ,ఇప్పటికయినా వీరిలో మార్పు వస్తే బాగుండు అంది' పిల్లల కు తోట కూర కథ చెప్పింది.ఇది అందరికి తెలిసిన కధే,స్కూల్లోమోరల్  సైన్స్ క్లాస్లో కూడా చెప్పేవారు . .అమ్మ మా చిన్నపుడు ఈ కధ చాలాసార్లు చెప్పింది ,రాత్రి పూట భోజనాలు చేసేటప్పుడు,ఇలాంటినీతికథలు,,మర్యదలగురించిఅన్నిచెప్పేది ,ఇప్పటికి ఆ కధలన్నిగుర్తున్నాయి .                                      ఒకపిల్లవాడు ,వాళ్ల ఇంటికి వచ్చిన కూరగాయల అమ్మి దగ్గరనుంచి తెలియకుండా తోటకూర దొంగ తనం చేసేడు.కురగాయలామ్మి వెళ్ళిన తరువాత ,వాళ్ల అమ్మకు చూపించేడు '.అరె!మేము అక్కడే ఉన్నము ఎలా తీసేవు ?'అని అతని చాకచక్యాన్నిమెచ్చుకుంది .అప్పట్నుంచి చిన్న దొంగ తనలు చేస్తా ,పెద్ద గజ దొంగ అయ్యేడు .యావజ్జీవ శిక్ష పడితే ,జైలు కి వెళ్లి తల్లి బోరున ఎడ్చిన్దంట.అప్పుడు కొడుకు 'ఎందుకు ఏడుస్తావమ్మ! ,నేను తోటకూర దొంగతనం చేసినప్పుడే నువ్వు మందలిస్తే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు'అన్నాడు. 'చూసేరా !సరదాగా చేసిన చిన్న దొంగతనము వాడి జీవితం ఎలా నాసనమయ్యిందో ,మీరు ఇంకా చాల చిన్నోళ్ళు ఇప్పటికయినా మీరు మారితే మీ జీవితాలు బాగుంటాయి' అని కథ ముగించింది . పిల్లలందరూ శ్రద్దగా విన్నారు .బయటకు వెళ్ళినాక మేము మంచి గ ఉంటామని మాట ఇచ్చేరు .అప్పుడప్పుడు వస్తా ఉండమని అడిగేరు ,మీరు మారతను అంటే తప్పకుండ వస్తాను అని చెప్పెను . తరువాత వారందరికి భోజనాలు వడ్డిచ్చేరు.స్పెషల్ భోజనం స్వీట్స్ ,చికెన్ బిర్యాని ,ఫ్రూట్స్ .వాళ్ళందరి కళ్ళలో కృతజ్ఞత ,ఆనందం .వారిదగ్గరసెలవు తీసుకుని   వచ్చేసేము.                                                                                                                        

Sunday, October 11, 2009

వరద ముంపు గ్రామాల్లో మా పర్యటన

                        రాష్ట్రమంతా వరదల గురించే చర్చ ,గంటల వ్యవదిలో కర్నూలు ,మహబూబ్ నగర్ జిల్లాలు మునిగిపోవటం ,ప్రజలందరు నిరశ్రేయులవటం ,కట్టలు  తెగిపోవటం .చాలబాదవేసింది ఛానల్స్ పోటీపడి ఆ దృశ్యాలని చూపిస్తున్నాయి .భాదితులతోపాటు  మీడియా వాళ్ళు కూడా పీకల లోతులో దిగి లైవ్ ప్రోగ్రాం చూపించటం .చూస్తకి క్రిష్నమ్మ ఉగ్రరూపం చాల భయంకరంగా  ,ఇంకోవైపు డమ్స్ నుంచి వచ్చే నీరు అందంగా పరవళ్ళు తొక్కుతూ (చూడటానికి రెండు కళ్ళు చాలవు ) .క్షణం క్షణం ఉత్కంఠ ,భయం,టెన్షన్ .వరదలు ఇప్పుడు గుంటూరు ,కృష్ణ జిల్లాలని ముంచెయ్యపోతున్నాయి, ప్రాణాలను రక్షించుకోందని చానల్స్ ,అధికారుల హెచ్చరికలు . టి. వి చూడకూడదు అనుకుంటూనే చూడటం .ఇలాకాదు డైరెక్ట్ గ వెళ్లి  పరిస్థితి చూడాలి అనుకున్నాను .
                                 మర్నాడు (అక్టోబర్ నాలుగు ) మా ఫ్రెండ్స్ బృందం ఎనిమిదిమంది ,అందరికి సోషల్ సర్వీసు అంటే ఇష్టం .గుంటూరు ,కృష్ణ జిల్లాలలో పర్యటించాలని అనుకున్నాము .ముందుగ కృష్ణకి వెళ్ళాలని ,ఇదు వేల పులిహార,పెర్గుఅన్నం పాకెట్స్ ,వాటర్ పాకెట్స్,   పెద్ద వేహికాల్స్ లో బయలు దేరేము . ప్రకాశం బరేజ్ అప్పటికి సందర్సకులని రానివ్వటంలేదు ,బరేజ్కి ఇవతల నుంచి చూసేము .కృష్ణమ్మా ఉగ్ర రూపం చాల భయంకరంగా   ఉంది .అక్కడ్నుంచి కరకట్ట ప్రాంతాలకి వచేము .దాదాపు ఇళ్ళని మునిగిపోయి అంత నదిలగా కనిపిస్తుంది.సగంమంది పునరావాస కేంద్రాలకి వెళ్ళేరు .సగంమంది కట్టమేదే వున్నారు 'ఎందుకు వెళ్ళలేదని 'అడిగితె,ఇంటిలో సామాను దొంగలు తిసుకుపోతరేమోనని వెల్లడము లేదని చెప్పేరు .కృష్ణమ్మా, దాదాపు కరకట్టని ఆనుకుని ప్రవహిస్తుంది .రాత్రికి పూర్తిగా మునిగిపోతుంది అనే భయం తో ఉన్నారు .పోలీసు సిబ్బంది యవ్వరిని దగరకు  వేల్లనివ్వటం లేదు .కొన్నిపెకేత్స్ వారికీ ఇచ్చి ,రామలింగేస్వర్ నగర్ బాగా మునిగిపోయిందంతా ,అక్కడికి బయలుదేరేము .దారిలోపునరవాసు కేంద్రాలని చూసేము ,వారికీ చాల మంచి ఆహరం ఇస్తున్నారు ,అన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు .
                                            బాగా ముంపుకు గురయిన లంకగ్రమల వైపు బయలు దేరేము.తొట్లవల్లూరు,ఘంటసాల,మోపిదేవి, చల్లప ,అవనిగడమండలాలలోని గ్రామాలన్నీ  మునిగాయంత, ముందుగ తొట్లవల్లూరు వేల్లేము,ప్రజప్రతినిదులు చాలమంది ఉన్నారు.నది ఒక సముద్రాన్ని తలపిస్తుంది ,ప్రవాహం ఉదృతంగా ఉంది .నీళ్ళు కట్టమీదకి  వచాయి మేము నిలబడితే మాకాళ్లని    తాకు తున్నాయి .కనుచూపుమేర లంక గ్రామాలూ కనిపించడం లేదు .అక్కడి ప్రజలు  సగంమంది గ్రామంలోనే ఉన్నారంట .వాళ్ళకి ప్రానలకన్నవారి ఆస్తులే ముఖ్యం అనిపించింది .మీడియావారు, పోలీసు సిబ్బంది దుమ్ముకోట్టుకుని చింపిరిజుట్టులుతో ఉన్నారు .రాత్రి,పగలు కూడా అక్కడే ఉంటున్నరంట్ట .పొదున్నించి టిఫ్ఫెన్ కూడా తినలేదు అన్నరు ,అప్పటికి పదకొండు దాటింది మా దగ్గర ఉన్న ఫుడ్ పాకెట్స్ ఇచ్చేము .లంక గ్రామలవారి కోసం సిబ్బందే భోజనం తిసుకువేలుతున్నారు,వారితోపాటు మీడియావారు అంతప్రవాహంలో చిన్న బోట్లో ,మమ్మల్ని వస్తార! అని  అడిగేరు. .నాకు వెళ్ళాలనిపించింది ,కాని వెళతాం అంటే ప్రాణాలకు తెగించి వెళ్ళటమే .అక్కడనుంచి వరుసగా  కట్ట వెంబడి ముంపుబాదితులకు, ఫుడ్ పాకెట్స్ ఇచుకుంట వేల్లేము .ఇంకా వారికీ ఏమి కావాలో అడిగేము !బట్టలు ,రైస్ కావాలన్నారు .ఈ సారి వచ్చినప్పుడు   ఇస్తామని చెప్పేము .
                                        మిగతా మండలాల్లో కట్ట పక్కన గ్రామాలూ వారిఇళ్లు పూర్తిగా కన్పించడం లేదు ,అక్కడక్కడ పెద్ద బిల్డింగ్స్ టాప్ మాత్రం కన్పిస్తున్నాయి .తోటలు అరటి ,పసుపు ,కంద ,చెరుకుఆనవాళ్ళు లేవు  .ఇంక ఏమి చెప్పాలి పూర్తి గ అన్ని కోల్పోయారు .కట్ట మీద ఉన్నవారికి చాల స్వచ్ఛంద సంస్థలు వచ్చి బ్రెడ్ ,బిస్సుత్స్ , బిర్యాని ,పులిహార ,మజ్జిగ .....ఇలా ఎన్నో మా వెనుకే చాల మంది వచ్చి ఇచ్చి వెళుతున్నారు .చాలవెస్ట్ కూడా ఇయిఉంతుంది .కాని ప్రజలు ఎగబడి తీసుకోవటం మేము కంట్రోల్ చెయ్యలేకపోయము ,వారిని అలా చూస్తుంటే చాల బాదగా అన్పించింది .చివరికి అవనిగడ్డ చేరేము , అక్కడ పునరావాసకేంద్రాలు చూసేము ,మాజీ మంత్రి  బుద్ధప్రసాద్ గారి అద్వర్యంలో చాలాబాగా చూస్తున్నారు .ఉన్న ఫుడ్ పాకెట్స్ అన్ని పంచేసేము .అక్కడనుంచి హంసలదివికి వెళ్దామని అనుకున్నాము (కృష్ణమ్మా వెళ్లి సముద్రంలో కలిసేచోటు)అక్కడకు  చాల దగ్గర ,కాని సందర్శకులను రానివ్వడంలేదని తెలిసి తిరుగు ప్రయాణం అయ్యాము .పులిగడ్డ అక్విదేట్ దగ్గర వంతేనమీద  ఆగేము .అబ్బ !ఎంత అందమయిన దృశ్యమో ,బందరు కాలువ వెళ్లి నదిని దాటుకుని వెళుతుంది ,దూరంగా ఆరెండు కలిసే చోటు కృష్ణమ్మా పరవళ్ళు,ఎంత అందంగా ఉందొ చెప్పలేము .వంతీన నుంచి కిందకి చూస్తుంటే వళ్ళు గగుర్పొడిచింది ..అక్కడనుంచి మోపిదేవి వచ్చేము ,టైం చుస్తే ఆరు దాటింది సుబ్రమణ్యస్వామి టెంపుల్ ప్రసిద్ది,టైంచుస్తేఆరుదాటింది ,అయినవేల్లల్సిందే అన్నారు .దర్సనం చేసుకున్నాక అందరికి ఆకలి గుర్తొచ్చింది .పొద్దున్నించి ఏమి తినలేదు ,కూల్డ్రింక్స్ బిస్సుత్స్ తో కడుపునింపుకుని తిరుప్రయనం అయ్యాము .మరుసటిరోజు గుంటూరు కి ఎలావెళ్ళాలో మాట్లాడుకుంటూ వచ్చేము .             
                               ప్రస్తుతం రైస్,దుప్పట్లు ,బట్టలు తీసుకుని రొండో సారి వెళ్ళే ఏర్పాటులో ఉన్నాము .