Thursday, September 24, 2009

snehitudu

 అది నేను ముడో తరగతి చదివేరోజులు. ఖమ్మం జిల్లాలో ఉండేవాళ్ళం. భద్రాచలానికి దగ్గరే అడవి ప్రాంతంలగుండేది .రొండు ఇళ్ళు కలిపి జంటగా ఉండేవి ,మళ్ళికొంచందూరంలోరొండో ఇల్లు ,ప్రహరీబదులు ,రేగు, జామ ,సీతాఫలం  చెట్లు ఉండేవి .ఎలా వచ్చేవో ,మా పెరట్లోకి నెమళ్ళు ,లేళ్ళు వస్తుండేవి .ఇంటి ముందు పెద్ద మైదానంలా కాళి స్థలం ఉండేది .నాన్నగారి బదిలీవలన అన్ని వూర్లు తిరగాల్సి వచ్చేది . ఊరు మాత్రం నాకు చాలానచ్చింది .కొత్తగా స్కూల్ లో జాయిన్ అయ్యాను,నా తో పాటు పెద్ద తమ్ముడిని (బాబోయ్ !వాడు మహా పెంకి వాడు లెండి)స్కూల్లో జాయిన్ చేసేరు .వాడేమో అమ్మకి ముద్దుల కొడుకు స్కూల్కి వెళ్లనని రోజు పేచి ....రిక్షాలోంచి దూకేసి పరుగు పెట్టేవాడు .రిక్షావాడు తమ్ముడు వెనకాల పరుగు,తమ్ముడు తనకు వచ్చిన భాష లో అతన్ని తిట్టటం ,కొట్టడం ,ఎలాగోలా స్కూల్కి తీసుకెళ్లడం లేట్ అవటంతో నన్ను బెంచి మీద నిలబెట్టేవారు .అలా చాలసార్లునిలబడాల్సివచ్చేది. నా చదువు సంగతి దేవుడెరుగు వాణ్ని అదుపు చెయ్యటానికే సమయం గడిచిపోయేది....ఇలా వాడి తో నా పాట్లు చాలానే ఉన్నాయ్లెండి.





ఊరికొచ్చిన కొద్దిపాటి రోజులలోనే ఇళ్ళ పక్కపిల్లలందరం  పెద్ద గ్యాంగ్ గా తయారయ్యాం .కాని వారందిరిలో పక్కింటి బాబ్జీ ..కుడి పక్కింటిలో సాగర్ తో ఎక్కువ ఆడుకునేదాన్ని.అందరం కలిసామంటే ఇంక మా అల్లరికి , ఆటలకి కొదవే లేదు .ఎన్నాటలో ......దాగుడు మూతలు ,కలర్ కలర్,నేలా బందా ,మా తా ఉత్తరం ,...........ఇలా ఎన్నో.ఎప్పుడైనా వర్షం కురిసి వెరిసిందంటే చాలు మా గ్యాంగ్ అంటా మైదానంలో కి చేరి ..... మట్టి లో ఎన్నో బొమ్మలు గీసేవాళ్ళం .అందరికంటే సాగర్ అద్భుతంగా గీసేవాడు.వాడు బాగా గీస్తాడన్న్న అసూయతో సాగర్ చెల్లి శాంతి దాన్ని తుడిపేసేది.దానితో కోపం వచ్చి సాగర్ శాంతి ని బాగా తిట్టాడు.అది ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది .మర్నాడు సాగర్ చొక్కా లేకుండా తిరగడం గమనించా . ఏమి అయ్యిందా ఆరా తీస్తే .........శాంతి వెళ్లి వాలన్నయ్య మీద చాడీలు చెప్పింది,దాని పర్యవసానం తెల్లటి వీపు   మీద ఎర్రటి ,వెడల్పాటి వాతలు,దానిమీద రాసిన ఆయింట్మెంట్ .సాగర్ వాళ్ళ  నాన్నగారు శాంతి ఏమిచెప్పినా నమ్మేసి ఇలా కొడతాడంట .నాకు మా ఫ్రెండ్స్ అందరికి చాల బాద వేసింది ,అందులో మా ఆటలకు బ్రేక్ ,అప్పటినుంచి శాంతి అంటే మాకు కోపం .అప్పుడప్పుడు సాగర్ మాకు అలాగే దర్సనం ఇస్తుండేవాడు .వాళ్ల నాన్నగారు పెద్ద ఆఫీసర్ , చూస్తాకి మంచివారి లాగా   వుండేవారు .మేమందరం వాళ్ల ఇంటికి వెళ్లి నప్పుడు వాళ్ల అమ్మ మమ్మల్ని పలకరించి తినడానికి స్వీట్స్ ఇస్తుండేవారు .సాగర్ అల్లరిచేసేవాడు కాదు,బాగా చదేవేవాడు .బాబ్జికి ,నాకు సాగర్ మీద జాలి ఉండేది.నెక్స్ట్ ఇయర్ బదిలిమీద వేరేఉరు వేల్లిపోయము .ఇప్పటికి ఆరోజులు గుర్తుకు వస్తుంటాయి ,ఎవరయినా వాళ్ల పిల్లలని కొడుతుంటే చాల కోపమువస్తుంది ,బాదవేస్తుంది వెళ్లి అడ్డుకుంటాను .




చాల మంది భార్యమీద కోపాన్ని ,భర్త మీద కోపాన్నిపిల్లలమీద చూపిస్తారు .మా పెద్దమ్మగారి అబ్బాయి (అన్నా)వాళ్ల ఆవిడా మీద కోపం వస్తే భయంకరంగా పిల్లలని కొట్టేవాడు ,వాళ్ల పిల్లలయినంత మాత్రాన కొట్టటానికి ఎవరికి హక్కు లేదు .అల్లాంటి వాళ్ళను దేముడే మార్చాలేమో !

Wednesday, September 23, 2009

ఈ తరం తల్లులు

"మమ్మీ ,నువ్వు బతికే వున్నావా ?"భయంగా చూసేరు వంశి ,కృష్ణ .

"అదేంటిరా !అల చూస్తున్నారు ,మీ అమ్మనిరా !"స్కూల్ కి వచ్చి తన పిల్లలని చూసి బోరున ఏడ్చింది మాధవి ."నువ్వు చచ్చి పోయావని డాడి చెప్పారు !"ఇంక అనుమానంగానే చూస్తూ చెప్పేరు .పిల్లలిద్దరిని దగరకు తీసుకుని ,తను చని పోలేదని ,బ్రతికే ఉన్నానని వారితోకొంచం సేపు గడిపి వెళ్ళిపోయింది .

మర్నాడు మాధవి ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరకు వచ్చింది ,భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవల వలన ఇంటిలోనుంచి వేల్లిపోమ్మనాడు ,పిల్లలు స్కూల్కి వెళ్ళిన సమయములో నన్ను బయటకు నేట్టేసేడు .అప్పటినుంచి నా పిల్లలని చూసుకునే అవకాసం లేకుండా పోయింది .పిల్లలని చుస్తకి వీలేదు అంటున్నాడు , నా పిల్లలు నాకు కావాలి అని చాల ఏడ్చింది .పాపం అన్పించింది ,తను చుస్తకి చాల చక్కగా ఉంది ,వయసు ముడుపదులు ఉండవచ్చు .ఆమె భర్తా పోలీస్ డిపార్టుమెంటు అంట ,డివోర్స్ కి కూడా అప్లై చేసేదంట.

ఇది మాధవి గా !

ఇలాంటి కధలు రోజుకి ఎన్నో , డీ వీ చట్టం వచ్చాక మహిళలు దైర్యంగా బయటకి వచ్చి సహాయము కోరుతున్నారు ,మగ మహారాజులు విడాకులు కావలి అంటున్నారు . మధ్య విడాకులు ఎక్కువయ్యాయి .పిల్లల సంగతి ఆలోచించేదేవరు ?ఎవరికి వాళ్ళు పంతాలు ,పట్టింపులు .మన సంసృతి కూడా మారిపోతుంది.

సరే ఇంతకి మాధవి బాధని అర్ధం చేసుకుని ,ఆమె భర్తా గారిని పెలిపించడం జరిగింది .'తల్లి పిల్లలని వేరు చేయడం నేరము మీకు ఎంత హక్కు ఉందొ ,ఆమెకు అంతే హక్కు ఉంటుంది ,ఆమె పిల్లలని చూసుకోవడానికి అవకసమివ్వండి ,తల్లికి ఎంత భాద ఉంటుందో మీకు తెలియదు 'అని అతనితో చెప్పడం జరిగింది .

నేను చెప్పేది కూడా వినండి అని అతని కథ చెప్పడం మొదలు పెట్టేడు ........వారిది ముచాటైన చిన్న సంసారం తొమిది , ఎనిమిది వయసున్న ఇద్దరు కొడుకులు .సొంత ఇల్లు ,ఆర్థిక ఇబ్బందులు లేవు ,ఇద్దరు డిగ్రీ చదివినవాళ్ళు ,అతనిది గవర్నమెంట్ జాబు ,ఇంకేమిటి సమస్య ?

వీళ్ళకి గోపాలరావు గారు అనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారంట ,వల్ల అబ్బాయిmadhu ,మాధవి అయన ఇద్దరు చాల బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట .పండగలకి పబ్బాలకి రావడం,వెళ్ళడం . పరిచయం కాస్త మాధవి, మధు స్నేహం ఎక్కువయ్యింది .అది కాస్త ప్రేమగా మారింది ,ఇద్దరు విడిగా ఉండలేని పరిస్థితి !గొడవలు మొదలవడము ,ఇంటిలోనుంచి పంపించైయ్యడము జరిగింది .ఆమె కూడా భర్త ని పిల్లలని వదిలేసి ప్రేమ కోసం వెళ్ళిపోయింది .ఇప్పుడు పిల్లలు కవల్సివచ్చార ?అని తన బాదనంత వెల్ల గక్కడు .

ఆచర్యపోవడం మవంతయింది ,ఎంతో అవమానం తో తలదించుకుంది .ఆమె మీ చాల కోపంగా అన్పించింది .పిల్లలని నాదాలుగా చేసి ,ప్రేమ కోసం vellevariki ఏమని న్యాయం చెప్పాలి ......

Monday, September 14, 2009

నాగరాజు 2

నేను,అమ్మ వాళ్లఇంటినుంచి మా ఇంటికి వస్తున్నాను ఎవరో నన్ను ఫాల్లో అవుతున్నట్లు అనిపించింది .వెనక్కి చూస్తే ఎవరులేరు కొంత దూరం నడిచేను ,మళ్లిఫాలో అవుతున్నాటు అనిపించిది ,వెనక్కి తిరిగి కిందకి చూసేను ,అమ్మో !ఇంకేముంది పెద్ద పాము (అనకొండ టైపు ) అంతేపరుగో పరుగు ,చాల సేపు పరిగెత్తేను విసలమయిన మైదానం అంత ఇసుక పరిగెట్టాలంటే చాల కష్టంగావుంది దూరంగా వాటర్ కనిపిస్తుంది .ఎక్కడికి వచ్చాను ?వెనక్కి చూసేను అది చాల స్పీడు వస్తుంది .ఇంక తప్పించుకోలేను నాపని అయిపొయింది !చమటలు కారిపోతున్నాయి ,మళ్లి పరుగు ......చెట్లు తుప్పలు దాటుకుని గుడి కూడా కనిపిస్తుంది కాని ఎక్కడ మానుష సంచారం లేదు .కాలు ఇసుకలో సగం కూరుకు పోతుంది ,అయిన పరుగు ఆపలేదు తారురోడ్ వచ్చింది .చుట్టూ చూస్తే యక్కడలేదు హమ్మయ్య అనుకుని చెట్టుకింద ఆగేను .క్షణం లో మళ్లి ప్రత్యక్షం ,మళ్లి పరుగు గుడి లాంటి చిన్న ఇల్లు తలుపులు తోసుకుని వెళ్లి తలుపులు వేసుకున్న .హమ్మయ్య !దేవుడా రక్షించేవు .

ఎవరో నన్ను తఃట్టి లేపు తున్నారు ,తుళ్ళిపడి లేచెను ,చూస్తే ఎదురుగ మా హస్బండ్ ఏమయింది ?అడుగుతున్నారు .ఇంతకి కల ,టైం చూస్తే తెల్లవారుజాము నాలుగు ,ఎంత టెన్షన్ పడ్డాను !కలానుకోగానే హ్యాపీ ఫీల్ అయ్యాను .

* * * *

రొండు రోజుల తరువాత రాజమండ్రీలో వుండే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి ఆహ్వానం వాళ్ల ఇంటిలో చిన్న ఫంక్షన్ కానీ తప్పకుండ వెళ్ళాలి .ఆరోజు ఆదివారం రాజమండ్రి కి వేల్లేము ,ఫంక్షన్ అయిపొయింది ఎవరో ప్రపోసల్ బోజనాలు అయ్యాక పట్టిసీమ వెళ్దామని ,ఎప్పుడో నచిన్నప్పుడు శివరాత్రి పండగప్పుడు బోట్లో గోదావరినది మధ్యలో ఉండే గుడికి తీసుకి వెళ్ళటం గుర్తు .అందులో గోదావరి దగ్గరకు నేను ఓకే అన్నాను .అందరమూ బయలు దేరి వెళ్ళే సరికి నాలుగు అయిపొయింది .టికెట్స్ తీసుకుని బోట్ ఎక్కేము ,గోదావరి మధ్యలో అబ్బ !ఎంత అందగా ఉంది ,ఏమని వర్ణించను ?చేతికి అందిన నీళ్ళతో ఒకరిమీద ఒకళ్ళం నీళ్లు చల్లుకుంటూ సరదాగా గడిపేము అంతలోనే నది మధ్య లో ఉన్నా లంక ధగ్గరకువచేము .ఎదురుగ గుడి కన్పిస్తుంది బోట్ దగ్గర నుంచి కొంత దూరం నడవాలి ,ప్రకృతి అందలనిచూస్త నడుస్తున్నాము .ఇసుకలో స్పీడుగా నడవలేక పోతున్న అందరిలో నేను కొంచం వెనకపడ్డాను ,నడవాల్సింది ఇంక చాల ఉంది .ఇదంతా ఎక్కడో చుసినట్లన్పించింది ,వెంటనే కల గుర్తు వచ్చింది .అవును!ఇదే ఇసుక ,నీళ్లు ,తుప్పలు చిన్నగుడి ,నాకు షాకు !అంతే ,గబగబా నడచి అందరితో చేరెను .ఆరోజు జనాలు ఎక్కువ లేరు .గుడి చాల ఎత్తులో ఉంది ,గుడి ఫై నుంచి చూడాలి గోదావరి అందాలని .దేవుడి దర్సనం అయ్యింది .అందరు వెళ్ళిపోతున్నారు సూర్యుడు అస్తమించుతున్నాడు .పుజరిగారు మాకు స్థల పురాణం గూర్చి చెప్పేరు .లాస్ట్ బోట్ అంట ,త్వరగా వెళ్ళమన్నారు .కానీ ఎవరికి కథలలని లేదు .నాకు మనసులో కొంచం బయం ,కలలోక నిపించదమేంటి ,అక్కడకే రావడమేంటి .అందరితో చెప్పాలని అన్పించింది కాని నమ్ముతారా ?మసకచికటి వచ్చేసింది ,ఏమో నాగరాజు వస్తాడేమో వస్తే ,యక్కడ తప్పించుకోవాలిఎందుకు తొందర పడుతున్నానో వాళ్ళకి అర్ధమవడం లేదు .మేము బోటు కోసం నిల్చున్నాము .చిన్నబోట్లో వెళ్ళే కుర్రాడు బొట్టు వెళ్ళిపోయింది అన్నాడు .ఇంక బోటు లేదు ,ఏంచెయ్యాలి ?వెన్నెల్లో గోదావరి ,ఇసుక తిన్నెలు ,మెరిసిపోతున్నాయి .ఇంతలోగుడి క్లోజ్ చేసి స్టాఫ్ కూడా బోట్ దగ్గరికి వచ్చేరు .వెళ్ళిపోయింది అని చెప్పగానే ఫోన్ చేసే వేరే బోటని పిలిపించేరు .బొట్లోకి ఎక్కినతరువాత అందరం ఉపిరి పీల్చుకున్నాము .బొట్లోనుంచి గుడిని చూస్తే నది మధ్యలో అందంగా కన్పిస్తుంది ,వరద వస్తే గుడి మొతం మునిగిపోతుంది అని మా చిన్నప్పుడు అనేవారు ,గుడి అనేదేకన్పించదు .

ఇప్పుడు సరిగా ఎంజాయ్ చెయ్య లేక పోయా !మళ్లి వెళ్ళాలని ,బోట్ లోనే తీర్మానం చేసుకున్న .

Monday, September 7, 2009

మీరైతే ఏమి చేస్తారు ?

చుట్టుపక్కల పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మండల ఆఫీసు వైపు అడుగులు వేస్తున్న,అక్కడ మీటింగ్ ఉన్నదని చప్పడంతో బయలుదేరెను అందరు ముందే వేల్లిపోయినట్లున్నారు . నేను వేరేఉరునుంచి రావాలి ఒక్కదాన్నే బస్ దిగెను .రోడ్ నుంచి 2km పొలాల్లోకి నడవాలి ,మట్టి రోడ్ వేసిఉంది.పచ్చాటిపోలాల మధ్యలో ఆ ఆఫీసు కట్టేరు .నవంబర్ నెల వరి చాల ఏపుగా ఎదిగి ఉంది ,పోలంలోపనిచేసేవాళ్ళు చాల దూరంలో ఉన్నరు .పొలాలను చూస్తూ నడుస్తున్నాను దాదాపురోడ్ కి మండల ఆఫీసుకి మధ్యకి వచ్చా ,అనుకొకున్దచూపు రోడ్ మీద పడింది ,పెద్ద నాగుపాము నాకు కొన్ని అడుగుల దూరంలో ఇవతలిపోలం నుంచి అవతలిపోలంలోకి వెలతానికి రోడ్ దాటుతుంది .నాపై ప్రాణాలు పోయయనుకున్న అక్కడే ఆగిపోయా !అది రోడ్ మధ్యలోనే ఆగిపోయింది .ఏమిచెయ్యాలి ?వెనక్కిపరుగు పెడదామంటే రోడ్ చాల దూరం లో ఉంది ,అది వెనకాల వస్తే నాకన్నా స్పీడ్గా వస్తుంది .చుట్టూ చుస్తే దురంగాపనిచేసేవాళ్ళు చేతులతో సైగ చేస్తున్నారు ,వాళ్ళకి అర్ధమయింది .ఆఫీసు నుంచి కూడా అందరు బయటకు వచ్చి చేతులు ఉపుతున్నారు కాని రక్షించటానికి ఎవరు రావడంలేదు .చమటలు పట్టేయి ,నపనియిపోయింది అని దేవుడిని తలుచుకుంటూ కథలకుండా నిలబడ్డ .
ఇదు నిముషాలు గడిచి ఉంటాయి అది స్లో గ కదులుతుంది నా వైపు రాకుండా పక్కనున్న పొలంలోకి వెళ్ళింది ,అప్పుడు గమనించ అక్కడ పెద్ద పుట్ట ఉంది ,అక్కడకు చేరుకుని పుట్టచుట్టు చుట్టుకుని పడగవిప్పి ఆడుతుంది నేను పరుగో పరుగు ........
అప్పుడు అందరు వచ్చి నన్ను చుట్టూ ముట్టరు ,అప్పుడు వచ్చాయి నకల్లలోని నీరు పటపట రాలాయి ,ఎంతగండం గడచింది .కానీ అందరు చాల గొప్పగా చుసేరునన్ను !ఎంత అదృష్టవంతురాలవు ,నాగేంద్రుడు కనిపించేడునీకు ,పుణ్యం చేసుకున్నవు అన్నరు .
ఇంతకి ఆఉరులో పెద్ద నాగు తిరుగుతా ఉంటాదంట ,కాని ఎవరికీ కనిపించదంతా ,ఒక్క పూజారికి కనిపిస్తుందంట్ట .ఉరిచివర పెద్దపుట్ట, దానికి ఎప్పుడో గుడి కట్టరంతా పొలంలో ఉన్నా పుట్టలోపలనుంచి అక్కడ ఉన్నా గుడి పుట్టలోకి వెళ్ళు తుంది అనిచేప్పేరు .అందుకే నేను ఆగి పోయేసరికి అందరికి అర్థమయిపోయిందంతా .
మీటింగ్ అయ్యాక గుడికి వెళ్ళమన్నారు !వెళ్ళకపోతే మల్లి ఎక్కడ కనిపిస్తాడేమో అని గుదికివెల్లి బ్రతుకు జీవుడా అనుకుంటూ తిరుగు ప్రయనమయ్య ...............

Friday, September 4, 2009

నీ జ్ఞాపకాల నీడలు .....

ముఖ్యమంత్రి గారి క్యాంపు ఆఫీసు ,సమయ 4గంటలు అవుతుంది పచ్చని లాన్లో కుర్చుని ఎదురు చూపులు .మసులో సియం గారిని చూదబోతున్నందుకు నాకు, నాతోటి స్నేహితులకు పెద్ద టెన్షన్ .మేమందరమూ కలసి సియం గారికి వినతిపత్రం ఇవ్వడానికి కూర్చున్నాం .తరవాత మమ్మల్ని చెక్ చేసి విజిటర్స్ రూంలో కూర్చోమన్నారు .ఆరోజు వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి గ ప్రమాణం చేసిన రోజు ,ఇలోపు విజిటర్స్ ఎక్కువయ్యారు !ఇంతలో ౩పేద్ద కార్లు వచ్చే సరికి సియం అనుకున్నాం ,కానీ పీద్ద బోకే తో రోశయ్యగారు ఇంకా ప్రమఖులు అబ్బో !మోహన్బాబు ,ధర్మవరపుఇంక చాలామందిdప్రముఖులు వచ్చారు . బలే టైం పాస్ ,ఆరు దాటుతుండగా సియం కాన్వాయ్ వచ్చింది .అందరు నన్నే వినతిపత్రం ఇవ్వమన్నారు .చేతిలోరేడ్ రొసేస్ బోకే తో నేను రెడీ .

చాల అనందం ,ఉద్వేగం!రాజ శేఖరుడు రాజసం ఉట్టిపడుతూ,చిరునవ్వు తో మెరిసిపోతూ అందరి కి నమస్కారం పెడుతున్నారు .విజిటర్స్ దగ్గరకు వచ్చారు ,బోకే ఇచ్చెను ,వినతి పత్రం ఇస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు దూరంగా వుండాలని రోపేపెట్టేరు ,మీరు ఉందండయ్య అని రామ్మా చెప్పు అని ఆప్యాయంగా చేతులు పట్టుకున్నారు . అయన సియం అయినతరువాత మొదటి వినతి పత్రం అదే అనుకుంట ,మేము అయన దగ్గర ఆటో గ్రాఫ్ తీసుకున్నాము .తరువాత మేము అయన పక్కనే చాలాసేపు ఉన్నాము .ప్రముఖులు ఇచ్చిన బొకేలు అందమయిన గులాబీలు మాకు ఇచ్చేరు .ఆ బొకేలని హాస్టల్ తెచ్చు కుని మురిసి పోయాము ,బద్రంగ చాలాకాలం దాచుకున్నాము .అల ఆపనిమేదే ప్రియతమ నాయకుడిని రెండు మూడు సార్లు కలిసేము అదేఆప్యాత .నినుమరవగలమా !.


!

మల్లన్న ఎంతపనిచేసేవయ్య !

రాత్రంతా ఏమని అడిగెను నిన్ను !
మారాజు ని రారాజు ని జాగ్రత్త చూసుకోమని ,నీకుదగ్గరలోనే ఉన్నాడని తెలిసి ఇంక భయము లేదు అనుకున్నా ,
నువ్వే రక్షించి తీసుకువస్తావని ,వెయ్యి కళ్ళతో ఎదురు చూసా కాని
నా ఆశని ఆడి ఆశని చేసేవు !
అడవిలో తప్పిపోయిన నీ బిడ్డన్లి ,ఆ చీకట్లో కారడవిలో,జోరున వస్తున్న వానలో
వదలివేయటానికి నీకు మనసు ఎలా ఒప్పింది ?
నిన్ను రక్షించమని అడగలేదని కోపమా!
వేరె దైవాన్నిపూజిస్తున్నారు ,వారే చూసుకుంటరులే అనుకున్నవా ?
ఎంత నిర్ధక్షన్యంగా వదిలివేసేవు ,ఇంతకటినమ నీ మనసు!
రాత్రంతా నిజపమే చేసేనుగా ,రాజన్ననీ రక్షించమని .
ఎందుకు ఇలా చేసేవు ?ఈ బాధని తట్టుకోలేక పోతున్నాను
నువ్వు కాకా ఇంక ఎవరితో చెప్పుకోను ?
చెప్పు .....చెప్పు........చెప్పు .........చెప్పుశ్రీశైల మల్లన్న!