Monday, September 14, 2009

నాగరాజు 2

నేను,అమ్మ వాళ్లఇంటినుంచి మా ఇంటికి వస్తున్నాను ఎవరో నన్ను ఫాల్లో అవుతున్నట్లు అనిపించింది .వెనక్కి చూస్తే ఎవరులేరు కొంత దూరం నడిచేను ,మళ్లిఫాలో అవుతున్నాటు అనిపించిది ,వెనక్కి తిరిగి కిందకి చూసేను ,అమ్మో !ఇంకేముంది పెద్ద పాము (అనకొండ టైపు ) అంతేపరుగో పరుగు ,చాల సేపు పరిగెత్తేను విసలమయిన మైదానం అంత ఇసుక పరిగెట్టాలంటే చాల కష్టంగావుంది దూరంగా వాటర్ కనిపిస్తుంది .ఎక్కడికి వచ్చాను ?వెనక్కి చూసేను అది చాల స్పీడు వస్తుంది .ఇంక తప్పించుకోలేను నాపని అయిపొయింది !చమటలు కారిపోతున్నాయి ,మళ్లి పరుగు ......చెట్లు తుప్పలు దాటుకుని గుడి కూడా కనిపిస్తుంది కాని ఎక్కడ మానుష సంచారం లేదు .కాలు ఇసుకలో సగం కూరుకు పోతుంది ,అయిన పరుగు ఆపలేదు తారురోడ్ వచ్చింది .చుట్టూ చూస్తే యక్కడలేదు హమ్మయ్య అనుకుని చెట్టుకింద ఆగేను .క్షణం లో మళ్లి ప్రత్యక్షం ,మళ్లి పరుగు గుడి లాంటి చిన్న ఇల్లు తలుపులు తోసుకుని వెళ్లి తలుపులు వేసుకున్న .హమ్మయ్య !దేవుడా రక్షించేవు .

ఎవరో నన్ను తఃట్టి లేపు తున్నారు ,తుళ్ళిపడి లేచెను ,చూస్తే ఎదురుగ మా హస్బండ్ ఏమయింది ?అడుగుతున్నారు .ఇంతకి కల ,టైం చూస్తే తెల్లవారుజాము నాలుగు ,ఎంత టెన్షన్ పడ్డాను !కలానుకోగానే హ్యాపీ ఫీల్ అయ్యాను .

* * * *

రొండు రోజుల తరువాత రాజమండ్రీలో వుండే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి ఆహ్వానం వాళ్ల ఇంటిలో చిన్న ఫంక్షన్ కానీ తప్పకుండ వెళ్ళాలి .ఆరోజు ఆదివారం రాజమండ్రి కి వేల్లేము ,ఫంక్షన్ అయిపొయింది ఎవరో ప్రపోసల్ బోజనాలు అయ్యాక పట్టిసీమ వెళ్దామని ,ఎప్పుడో నచిన్నప్పుడు శివరాత్రి పండగప్పుడు బోట్లో గోదావరినది మధ్యలో ఉండే గుడికి తీసుకి వెళ్ళటం గుర్తు .అందులో గోదావరి దగ్గరకు నేను ఓకే అన్నాను .అందరమూ బయలు దేరి వెళ్ళే సరికి నాలుగు అయిపొయింది .టికెట్స్ తీసుకుని బోట్ ఎక్కేము ,గోదావరి మధ్యలో అబ్బ !ఎంత అందగా ఉంది ,ఏమని వర్ణించను ?చేతికి అందిన నీళ్ళతో ఒకరిమీద ఒకళ్ళం నీళ్లు చల్లుకుంటూ సరదాగా గడిపేము అంతలోనే నది మధ్య లో ఉన్నా లంక ధగ్గరకువచేము .ఎదురుగ గుడి కన్పిస్తుంది బోట్ దగ్గర నుంచి కొంత దూరం నడవాలి ,ప్రకృతి అందలనిచూస్త నడుస్తున్నాము .ఇసుకలో స్పీడుగా నడవలేక పోతున్న అందరిలో నేను కొంచం వెనకపడ్డాను ,నడవాల్సింది ఇంక చాల ఉంది .ఇదంతా ఎక్కడో చుసినట్లన్పించింది ,వెంటనే కల గుర్తు వచ్చింది .అవును!ఇదే ఇసుక ,నీళ్లు ,తుప్పలు చిన్నగుడి ,నాకు షాకు !అంతే ,గబగబా నడచి అందరితో చేరెను .ఆరోజు జనాలు ఎక్కువ లేరు .గుడి చాల ఎత్తులో ఉంది ,గుడి ఫై నుంచి చూడాలి గోదావరి అందాలని .దేవుడి దర్సనం అయ్యింది .అందరు వెళ్ళిపోతున్నారు సూర్యుడు అస్తమించుతున్నాడు .పుజరిగారు మాకు స్థల పురాణం గూర్చి చెప్పేరు .లాస్ట్ బోట్ అంట ,త్వరగా వెళ్ళమన్నారు .కానీ ఎవరికి కథలలని లేదు .నాకు మనసులో కొంచం బయం ,కలలోక నిపించదమేంటి ,అక్కడకే రావడమేంటి .అందరితో చెప్పాలని అన్పించింది కాని నమ్ముతారా ?మసకచికటి వచ్చేసింది ,ఏమో నాగరాజు వస్తాడేమో వస్తే ,యక్కడ తప్పించుకోవాలిఎందుకు తొందర పడుతున్నానో వాళ్ళకి అర్ధమవడం లేదు .మేము బోటు కోసం నిల్చున్నాము .చిన్నబోట్లో వెళ్ళే కుర్రాడు బొట్టు వెళ్ళిపోయింది అన్నాడు .ఇంక బోటు లేదు ,ఏంచెయ్యాలి ?వెన్నెల్లో గోదావరి ,ఇసుక తిన్నెలు ,మెరిసిపోతున్నాయి .ఇంతలోగుడి క్లోజ్ చేసి స్టాఫ్ కూడా బోట్ దగ్గరికి వచ్చేరు .వెళ్ళిపోయింది అని చెప్పగానే ఫోన్ చేసే వేరే బోటని పిలిపించేరు .బొట్లోకి ఎక్కినతరువాత అందరం ఉపిరి పీల్చుకున్నాము .బొట్లోనుంచి గుడిని చూస్తే నది మధ్యలో అందంగా కన్పిస్తుంది ,వరద వస్తే గుడి మొతం మునిగిపోతుంది అని మా చిన్నప్పుడు అనేవారు ,గుడి అనేదేకన్పించదు .

ఇప్పుడు సరిగా ఎంజాయ్ చెయ్య లేక పోయా !మళ్లి వెళ్ళాలని ,బోట్ లోనే తీర్మానం చేసుకున్న .

Monday, September 7, 2009

మీరైతే ఏమి చేస్తారు ?

చుట్టుపక్కల పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మండల ఆఫీసు వైపు అడుగులు వేస్తున్న,అక్కడ మీటింగ్ ఉన్నదని చప్పడంతో బయలుదేరెను అందరు ముందే వేల్లిపోయినట్లున్నారు . నేను వేరేఉరునుంచి రావాలి ఒక్కదాన్నే బస్ దిగెను .రోడ్ నుంచి 2km పొలాల్లోకి నడవాలి ,మట్టి రోడ్ వేసిఉంది.పచ్చాటిపోలాల మధ్యలో ఆ ఆఫీసు కట్టేరు .నవంబర్ నెల వరి చాల ఏపుగా ఎదిగి ఉంది ,పోలంలోపనిచేసేవాళ్ళు చాల దూరంలో ఉన్నరు .పొలాలను చూస్తూ నడుస్తున్నాను దాదాపురోడ్ కి మండల ఆఫీసుకి మధ్యకి వచ్చా ,అనుకొకున్దచూపు రోడ్ మీద పడింది ,పెద్ద నాగుపాము నాకు కొన్ని అడుగుల దూరంలో ఇవతలిపోలం నుంచి అవతలిపోలంలోకి వెలతానికి రోడ్ దాటుతుంది .నాపై ప్రాణాలు పోయయనుకున్న అక్కడే ఆగిపోయా !అది రోడ్ మధ్యలోనే ఆగిపోయింది .ఏమిచెయ్యాలి ?వెనక్కిపరుగు పెడదామంటే రోడ్ చాల దూరం లో ఉంది ,అది వెనకాల వస్తే నాకన్నా స్పీడ్గా వస్తుంది .చుట్టూ చుస్తే దురంగాపనిచేసేవాళ్ళు చేతులతో సైగ చేస్తున్నారు ,వాళ్ళకి అర్ధమయింది .ఆఫీసు నుంచి కూడా అందరు బయటకు వచ్చి చేతులు ఉపుతున్నారు కాని రక్షించటానికి ఎవరు రావడంలేదు .చమటలు పట్టేయి ,నపనియిపోయింది అని దేవుడిని తలుచుకుంటూ కథలకుండా నిలబడ్డ .
ఇదు నిముషాలు గడిచి ఉంటాయి అది స్లో గ కదులుతుంది నా వైపు రాకుండా పక్కనున్న పొలంలోకి వెళ్ళింది ,అప్పుడు గమనించ అక్కడ పెద్ద పుట్ట ఉంది ,అక్కడకు చేరుకుని పుట్టచుట్టు చుట్టుకుని పడగవిప్పి ఆడుతుంది నేను పరుగో పరుగు ........
అప్పుడు అందరు వచ్చి నన్ను చుట్టూ ముట్టరు ,అప్పుడు వచ్చాయి నకల్లలోని నీరు పటపట రాలాయి ,ఎంతగండం గడచింది .కానీ అందరు చాల గొప్పగా చుసేరునన్ను !ఎంత అదృష్టవంతురాలవు ,నాగేంద్రుడు కనిపించేడునీకు ,పుణ్యం చేసుకున్నవు అన్నరు .
ఇంతకి ఆఉరులో పెద్ద నాగు తిరుగుతా ఉంటాదంట ,కాని ఎవరికీ కనిపించదంతా ,ఒక్క పూజారికి కనిపిస్తుందంట్ట .ఉరిచివర పెద్దపుట్ట, దానికి ఎప్పుడో గుడి కట్టరంతా పొలంలో ఉన్నా పుట్టలోపలనుంచి అక్కడ ఉన్నా గుడి పుట్టలోకి వెళ్ళు తుంది అనిచేప్పేరు .అందుకే నేను ఆగి పోయేసరికి అందరికి అర్థమయిపోయిందంతా .
మీటింగ్ అయ్యాక గుడికి వెళ్ళమన్నారు !వెళ్ళకపోతే మల్లి ఎక్కడ కనిపిస్తాడేమో అని గుదికివెల్లి బ్రతుకు జీవుడా అనుకుంటూ తిరుగు ప్రయనమయ్య ...............

Friday, September 4, 2009

నీ జ్ఞాపకాల నీడలు .....

ముఖ్యమంత్రి గారి క్యాంపు ఆఫీసు ,సమయ 4గంటలు అవుతుంది పచ్చని లాన్లో కుర్చుని ఎదురు చూపులు .మసులో సియం గారిని చూదబోతున్నందుకు నాకు, నాతోటి స్నేహితులకు పెద్ద టెన్షన్ .మేమందరమూ కలసి సియం గారికి వినతిపత్రం ఇవ్వడానికి కూర్చున్నాం .తరవాత మమ్మల్ని చెక్ చేసి విజిటర్స్ రూంలో కూర్చోమన్నారు .ఆరోజు వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి గ ప్రమాణం చేసిన రోజు ,ఇలోపు విజిటర్స్ ఎక్కువయ్యారు !ఇంతలో ౩పేద్ద కార్లు వచ్చే సరికి సియం అనుకున్నాం ,కానీ పీద్ద బోకే తో రోశయ్యగారు ఇంకా ప్రమఖులు అబ్బో !మోహన్బాబు ,ధర్మవరపుఇంక చాలామందిdప్రముఖులు వచ్చారు . బలే టైం పాస్ ,ఆరు దాటుతుండగా సియం కాన్వాయ్ వచ్చింది .అందరు నన్నే వినతిపత్రం ఇవ్వమన్నారు .చేతిలోరేడ్ రొసేస్ బోకే తో నేను రెడీ .

చాల అనందం ,ఉద్వేగం!రాజ శేఖరుడు రాజసం ఉట్టిపడుతూ,చిరునవ్వు తో మెరిసిపోతూ అందరి కి నమస్కారం పెడుతున్నారు .విజిటర్స్ దగ్గరకు వచ్చారు ,బోకే ఇచ్చెను ,వినతి పత్రం ఇస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు దూరంగా వుండాలని రోపేపెట్టేరు ,మీరు ఉందండయ్య అని రామ్మా చెప్పు అని ఆప్యాయంగా చేతులు పట్టుకున్నారు . అయన సియం అయినతరువాత మొదటి వినతి పత్రం అదే అనుకుంట ,మేము అయన దగ్గర ఆటో గ్రాఫ్ తీసుకున్నాము .తరువాత మేము అయన పక్కనే చాలాసేపు ఉన్నాము .ప్రముఖులు ఇచ్చిన బొకేలు అందమయిన గులాబీలు మాకు ఇచ్చేరు .ఆ బొకేలని హాస్టల్ తెచ్చు కుని మురిసి పోయాము ,బద్రంగ చాలాకాలం దాచుకున్నాము .అల ఆపనిమేదే ప్రియతమ నాయకుడిని రెండు మూడు సార్లు కలిసేము అదేఆప్యాత .నినుమరవగలమా !.


!

మల్లన్న ఎంతపనిచేసేవయ్య !

రాత్రంతా ఏమని అడిగెను నిన్ను !
మారాజు ని రారాజు ని జాగ్రత్త చూసుకోమని ,నీకుదగ్గరలోనే ఉన్నాడని తెలిసి ఇంక భయము లేదు అనుకున్నా ,
నువ్వే రక్షించి తీసుకువస్తావని ,వెయ్యి కళ్ళతో ఎదురు చూసా కాని
నా ఆశని ఆడి ఆశని చేసేవు !
అడవిలో తప్పిపోయిన నీ బిడ్డన్లి ,ఆ చీకట్లో కారడవిలో,జోరున వస్తున్న వానలో
వదలివేయటానికి నీకు మనసు ఎలా ఒప్పింది ?
నిన్ను రక్షించమని అడగలేదని కోపమా!
వేరె దైవాన్నిపూజిస్తున్నారు ,వారే చూసుకుంటరులే అనుకున్నవా ?
ఎంత నిర్ధక్షన్యంగా వదిలివేసేవు ,ఇంతకటినమ నీ మనసు!
రాత్రంతా నిజపమే చేసేనుగా ,రాజన్ననీ రక్షించమని .
ఎందుకు ఇలా చేసేవు ?ఈ బాధని తట్టుకోలేక పోతున్నాను
నువ్వు కాకా ఇంక ఎవరితో చెప్పుకోను ?
చెప్పు .....చెప్పు........చెప్పు .........చెప్పుశ్రీశైల మల్లన్న!

Sunday, August 23, 2009

బొజ్జ గణపతి

నా చిత్తూర్ జ్ఞాపకాలు లో మరొకటి . బయటనుంచి అరుపులు ,కేకలు.నిద్రలో ఉన్నానేమో ఉలిక్కిపడి లేచాను ,టైం చూస్తే ఉదయం ఎడుగంటలూ ఆరోజు ఆదివారం స్కూల్ లేదు .బయటికి వచ్చి చూసేను .అప్పటికే అమ్మ గేటు లో నుంచుని వుంది.పక్కింటి సుబ్రహ్మణ్యం తన ఇద్దరి బార్యలని రోకలిబండ తో తన్నుతున్నాడు ,మద్డ్యలో వాళ్ళకున్న పొడవాటి కురులను మెలిపెట్టి నేలకేసి కొడుతున్నాడు .చుట్టూ జనం బొమ్మల్లా చూస్తున్నారు .అమ్మ కోపాన్ని ఆపుకోలేకపోయింది .అపూ !వాళ్ళమీద చెయ్య పడిందా మర్యాదగా వుండదు ,అనిఅరచింది .సుబ్రమణ్యం కూడా షాక్! రోకలిబడని పడేసి ఇంట్టిలోకి వెళ్లి తలుపు వేసుకున్నడు .చట్టువున్నవారు అమ్మని అభినందిన్చేరు .రోజ్జుఇదే గొడవ అమ్మకూడా పట్టించుకునేది కాదు మనకెందుకులే అనుకునేది ,ఆరోజు మాత్రం అదేబ్బలకి వారు బతకరేమో అని వారి విషయంలో కల్పించుకుంది అమ్మాంటే అచుట్టుపక్కల గౌరవం ఆఫీసర్ గారి వైఫ్ గ అందరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు . సుబ్రమణ్యం వాళ్ళుమాపక్క ఇంటిలోవుండేవారు ,వారిది పెద్ద లోగిలి ఇల్లు ,కంపౌండ్లోనే పది మగ్గలదాకవుందేవి .చీరలు నేస్తవుండేవారు ,పీలగాపోట్టిగా తెల్లగావుండే సుబ్రమన్యంకి బార్య నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు .బార్య మంచి హైటు మొకల్లవరకువుందే పొడవాటి కురులు, చెల్లెలు సరోజ ఇంక అందంగా వుంటుంది .ఈ పొట్టి హీరో మరదలినిఇష్టామంట ,నాకు !మీ చెల్లి ని ఇచ్చి పెల్లిచేయ్యండి లేకపోతే చచిపోతనని అనేవాడట !అలబార్యని హింసించేవాడు.నిజంగానే రొండు సార్లుఎట్టేమ్ప్ట్ చెస్తే దానితో ఆమె బయపడి పేరెంట్స్ ని చెల్లి ని బతిమాలి మంగల్యాన్ని రక్షించమని కోరిందంతా .వాళ్ళు ఒప్పుకోలేదు చివరికి ఎలాగైతేనేమి వప్పిచింది . తన కా పురాన్ని షేర్ చెయ్యలంటే ఎవరికిఇష్టం వున్నటుంది ,అది సొంత చెల్లితో !సరోజకి కష్టాలు ప్రారంబం ,అక్క సరిగ్గా తిండి పెట్టెకాదంట మాటలతో చేతలతో బాగా బాద పెట్తేదాంత .సరోజ కి ఒక బాబు పుట్టెడు కష్టాలు ఇంక ఎక్కువయ్యంత.సరోజతో మాట్లాడేవారే లేరు చుట్టుపక్కలఎవరితోను మాట్లాడనిచ్చేదికదంతా .బాధలు బరించలేక సరోజ ఎదురు తిరగడం మొదలుపెట్టింది .రోజు యుద్ధం అగోదవతో ఇద్దరినీ కొట్టడం మొదలు పెట్టేడు . వల్లామ్మయలు గీత లతా నాస్నేహితులు వాళ్ళతో ఆడుకుంటూ వుండేదాన్ని వాళ్ళింటిలో మగ్గాలమీదే నేస్తూవుంటే నాకుఅచ్చర్యంగా వుండేది !మగ్గాలు కాలిగా వున్నపుడు నెను ట్రై చేసేదాన్ని చాలకష్టంగా వుఉండేది .సరోజ కొడుకు మూడేళ్ళ వాడు ముద్దుగా బొద్దుగా చేరు బొజ్జతో వుఉండేవాడు .వాడంటే నాకు చాల ఇష్టం ,అసలు పిల్లలంటేనే నాకు ఇష్టం నావయసు ఎనిమిది , కాని పెద్దదని లాగ ఇంటి పక్క పిల్లలందరినీ అందరిని ఆదిచ్చేదాన్ని .గణపతిని మాఇంట్లో బొజ్జ గణపతి అని పిలిచేవాళ్ళం సరోజ కొడుకుఅని ఎవరు ఎతుకునేవారు కాదు .సరోజబాధలని అమ్మతో షేర్ చేసు కునేది .నెను ఎక్కువ గణపతి తోనే ఆడుకునేదాన్ని .అక్కాచెల్లెలు మంచి ముడ్లో వున్నప్పుడు వారి వంటకాలని మాకు పంపిస్తవుందేవాళ్ళు .మేము పక్క కృష్ణ జిల్లవాళ్ళం .వారి మునగాకు పోల్లింపువిత్ వేరుసేనగాపొడి ,పప్పు మునగాకు ,అవిసకు పోల్లింపు ఇలా రక రకరకాల వంటకాల వంటకాలు ఇస్తూ న్దేవాళ్ళు .మేము తినలేకపోయేవాళ్ళం .బొజ్జ గణపతి మాత్రం అన్ని తినేవాడు చిరు బొజ్జ తో షర్టులేకుండా తిరుగుతుండేవాడు .ఇంట్లో గొడవజరిగినపుడు మాత్రం బిక్కమోహంవేసుకుని చూసేవాడు .సంవత్సరం తరువతనన్నగారికి బదిలీ మీద కొవ్వూరు వేల్లిపోయీము .వచ్చేస్తుంటే అందరుబాధపడ్డారు . ముఖ్యంగా సరోజ తనకిదైర్యాన్ని ఇచ్చే వారు వేల్లిపోతున్నారని బాధపడింది .నేను గణపతిని వదలివేల్లతకి బాదపద్దను . . అయిదు ఏళ్ళ తరవాత పనిమీద , నాన్నగారి ఆఫీసు వాళ్ళు మా ఇంటికి వచ్చేరు .వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉండేవారు ,అమ్మ !గణపతి వాళ్ళు ఎలా వున్నరు అని అడిగింది .ఇంకెక్కడి గణపతి ,మీరు వచ్చేసిన సంవస్తరం తరువాత ఒక తెల్లవారు జమున సరోజ ,గణపతి వారి ఇంటి పెరట్లో వున్నా బావి లో కన్పించారు !అని చెప్పేరు .అందరం షాక్ !

Thursday, August 20, 2009

నా గుండె జారిన రోజు-2

ట్యూషన్ కి వెళ్ళాను అన్నాను.మా అమ్మ ట్యూషన్ టీచర్ కి స్వీట్స్ తీసుకుని వెళ్ళమని అన్నది .స్వీట్స్ ఇచ్చేసి ఆవిడ దగ్గర పెర్మిషన్ తీసుకుని వచ్చేద్దామని వెళ్లాను .మా టీచర్ బర్త్ డే విషెస్ లెక్కల పుస్తకం తీయమంది .ఎగ్జామ్స్ వున్నాయి కాబట్టి తప్పదుఅన్నది.నా ఆనందం అంతా ఒక్కసారే ఎగిరిపోయింది.
బలవంతాన బుక్ తీశాను ,దూరంగా కొండ మీద నుంచి మురుగన్ స్వామి గుడినుంచి పాటలు వినిపిస్తున్నాయి .అక్కడ పారిజాతం పూల చెట్టు వుంటుంది ,అక్కడ కుప్పలుగా పూలు రాలి పది వుంటాయి .వాటిని ఏరుకుని ఆడుకోవడం నాకు చాల ఇష్టం .అందుకే ముఖ్యంగా గుడి కి వెళ్ళేదాన్ని .
నా ఆలోచనలన్నీ గుడి చుట్టూనే తిరుగుతున్నాయి ...ఎప్పుడేపుడుపుస్తకం మూసి ఇంటికి వెళ్తానా అని...టీచర్ మీద చాల కోపంగా వుంది ,ఎలనైతేనేం ట్యూషన్ అయ్యిందనిపించాను .నేను బయలుదేరబోతుండగా టీచర్గారు నాకో ప్యాకెట్ అందించారు ..నాకు ఆశ్చర్యం అక్కడే గబగబా విప్పి చూసాను ,ఆలివ్ గ్రీన్ గోల్డ్ కలర్ అంచు వున్నా ఇంకు పెన్ను ,పెన్సిల్ ఎరైసేర్ ,స్కేల్ ....నేను గాల్లో తెలిపోయాను ,అప్పటిలో ఐదులోకి వస్తే కాని పెన్ ఇచ్చేవారు కాదు ,నేనేమో నాలుగాయే ,నాకంటూ స్వంత పెన్ రావడం ...అబ్బో ఎంత ఆనందమో ....పదేపదే చూసుకున్నాను ..అప్పటివరకు ఆవిడ మీదున్న కోపం ఎగిరిపోయింది.ముందు అక్కవాళ్ళకి చూపించాలి ,థాంక్స్ కూడా చెప్పలేదు ,ఒకటే పరుగు ...ఇంటికేసి ,ట్యూషన్ నుండి కొంత దూరం నడిచి మలుపు తిరిగాను ,ఒక్కసారి మళ్లిపెన్ చూడాలి అనిపించింది ,అప్పుడే చీకటి అలుముకుంటుంది ,బాగ్ నుండి పెన్ తీసి చూసుకుంటున్నాను ,చేతినుండి పెన్ జర్రున జారి పడింది ,నేను కిందకి చుస్తే నేను నిలబడి వున్నది బండరాళ్ళు పరిచి వున్నా డ్రైనేజి ,రాయికి రాయికి మద్య చిన్న సందు ,ఆ సందులోకి నా పెన్ జారిపోయింది .....పెన్ కాదు నా గుండె జారిపోయింది ,చాలాసేపు తొంగి చూసాను ఎక్కడ జాడలేదు ......కళ్ళ లో నీటితో బరువెక్కిన గుండె తో ఇంటికి బయలుదేరాను ....అటు గుడికి చెడ్డాను ..ఇటు పెన్ను దక్కిన్చుకోలేకపోయాను ,కాని ఇంట్లో వాళ్ళతో మాత్రం పోయిన నా పెన్ గురించి వర్ణించి వర్ణించి చెప్పి తృప్తి పడ్డాను .ఆ రోజు మొదలు నేను ట్యూషన్ కి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ప్రతిరోజు పెన్ పడ్డ చోటు బండల మద్యలోకి చూసి వెళ్ళేదాన్ని ,ఎప్పటికైనా కనిపిస్తుదేమోనని ...

Tuesday, August 18, 2009

నా గుండె జారిన రోజు -1

నాన్న గారి ఉద్యోగ రీత్యా చిత్తూర్లో ఉన్నాము .అది అక్టోబరు .స్కూలు నుండి ఇంటికి వచ్చాను.చాలాఆనందంగా ఉన్నాను.ఎందుకంటే ఆ రోజు నా పుట్టినరోజు .స్కూల్లో అందరికి చాక్లెట్లు పంచేసరికి పిల్లలంతా నా చుట్టూ తిరుగుతూ వి.ఐ.పి లా ట్రీట్ చేసారు .ఆ ఆనందం నుండి తెరుకునేలోపే ఇంటికి వచ్చేసా . ఆ రోజుకి ప్రై వేటు డుమ్మా కొడదామనుకున్నా కాని అమ్మ మాత్రం ప్రై వేటు నుండి వచ్చినాకే గుడి కి వేల్దామంది.అది నాకెంతో ఇష్టమైన గుడి . ఇంటికి దగ్గర లోనే కొండ మీద మురుగన్ స్వామి గుడి ఉండేది . ప్రతి పండగకీ ఇంట్లోవారందరం తప్పకుండా దర్సిస్తాం ఆ గుడిని.మేమే కాదు ఆ గుడి మా ఊర్లోనే చాలా ఫేమస్ .

ఇంకా వుంది