Saturday, March 27, 2010

"మా ఇంటి దాదా "

                                              నాన్న గారి ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉన్నాము .అప్పటికే అక్కవాళ్ళు కోత్త స్కూల్లో జాయిన్ అయ్యారు . నాకు నాలుగేళ్ళ వయసు ,అక్క వాళ్ళు చదివే స్కూల్లోనే నన్ను ఒకటవ తరగతిలో చిన్న అక్క తో
పాటు ఆమె క్లాసు లో కొత్తగా జాయిన్ చేసేరు .కొత్త అయిన నేనేమి ఏడవలేదు అక్క వాళ్ళతో చక్కగా వెళ్ళెను .స్కూల్ లో నాతోటి పిల్లలు చాలామంది ఉన్నారు ,వాళ్ళందరిని చూస్తాఅక్కతో పాటు నుంచున్నాను .ఇంతలో క్లాసు లోకి మాస్టర్ వచ్చేరు .మాస్టర్ గారికి నన్ను అప్పచెప్పి అక్క వెళ్ళిపోయింది.మాస్టర్ గారు తెల్లగా, లావుగా పంచె కట్టుకుని ,పిలక ,నుదుటన పొడవాటి తిలకం,అయన పేరు శ్రీనివాసాచారి .నన్ను ఎత్తుకుని ముద్దుపెట్టుకుని(నేను చాల బొద్దుగా ముద్దు ఉండే దాన్నంట) అయన టేబుల్ మీద కుర్చోపెట్టుకున్నారు.స్కూల్ అయిపోయాక అక్కవల్లతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాను .మర్నాడు స్కూల్కి వెళ్ళాక మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టారు ,మిగతా పిల్లలందరూ బల్లల మీద కూర్చున్నారు.మాస్టర్ గారు జేబులోనుంచి పటిక బెల్లం ముక్కలు (పలకలుగా చిన్నవిగా ఉన్నాయి )నాచేతిలో పోసేరు ,నాకు బాగా నచ్చయి,తిన్నాను .


పిల్లలందరికీ బోర్డ్ మీద రాసి రాయమనేవారు .నాకయితే పలకమీద రాసిచ్చి దిద్దమనేవారు .నేను రోజు అయన టేబుల్ మీదే కుర్చునేదాన్ని ,రోజు పటికబెల్లం ముక్కలు ఇచ్చేవారు .నా స్కూల్ డేస్ మొదటి సంవత్సరం సంతోషంగా గడిచిపోయింది (ఈ మధ్య మా స్కూల్ ,అప్పట్లో మేము ఉన్న ఇల్లు అన్ని చూసి వచ్చెను .(అక్కడ రెండు ఏళ్ళ తరవాత వేల్లిపోయము ) మల్లి ఇప్పుడే చూడటము,నా సంతోషాన్ని మాటలతో చెప్పలేను .
                                         రెండో తరగతిలోకి వచ్చెను ,నన్ను అక్కని ప్రైవేటు కి పంపించేరు,నేను సైలెంట్ ,అల్లరి చేసేదాన్ని కాదు .అక్క అల్లరి చెప్పక్కరలేదు ,చాల గడుసు ,ఆటలు ,పాటలు.ఆమె ఫస్ట్ ఉండాలి .వేరే ఎవరికయినా వచ్చిందా కంటిచుపుతోనే భస్వం చేసేది . సన్నగా ,తెల్లగా ఉండేది ,స్టైల్ గ తయారవడం చాల ఇష్టం ,అమ్మ జడ వేసినాక చివర్లో నీళ్ళు తడిపి ఉంగరాలు వచ్చేలాగ తిప్పేది ,పౌడర్ టిన్నుమేము ఇల్లంతా పడేస్తామని అమ్మ పైన పెట్టేది ,మన" దాదా" గారికి అందేది కాదు,కానీ మొహానికి పౌడర్ రాసుకుని కాటుక పెట్టుకోవాలి ఏంచెయ్యాలి ?బియ్యం డబ్బా దగ్గరకు వెళ్లి చేతులు దాంట్లో పెట్టేసి ,చిన్న చేతులతో మొహమంతా పులుముకునేది .బియ్యంలో ఉన్న వైట్ డస్ట్ పేస్ మీద ,కాటుక తీసుకుని అమ్మకు తెలియకుండా ఫిష్ ఆకారంలో కళ్ళ చివరివరకు పుల్లతో దిద్దేది .
ప్రవేట్ క్లాసు  లో ఫిఫ్త్ క్లాసు వరకు ఒక గ్రూప్ గా  కుర్చోపెట్టేవారు .అందరికి క్లాసు వర్క్ ఇచ్చేవారు. టేబుల్స్ ,,తీసివేత, కూడికలు ఇచ్చేవారు . మనమందరం ఒక్కసారే మాస్టర్ దగ్గరకు వెళ్లి చుపిద్దము అని చిన్న అక్క మాతో చెప్పేది .నాది ఇంకా అవలేదు మీరంతా మెల్లిగా రాయండి అని చెప్పేది.నాది ముందు అయిపోయిన అమెది అవలేదేమో అని కుర్చునేదాన్ని ,మిగతా ఫ్రెండ్స్ అందరుకూడాస్లోవ్గా రాస్తా ఉండేవాళ్ళు .ఈలోపుచిన్నక్క వెళ్లి మాస్టర్ కి చుపించేసేది ,అందరికన్నా ముందు రాసినందుకు ఆమెని మెచ్చుకుని ,ఇంకా రాయనందుకు మిగతావారిని తిట్టేఅలా ఎందుకు చేసేవు అని అడిగే దైర్యం ఎవరికి ఉండేది కాదు ,ఒకవేళ ఎవరయినా అడిగితె వాళ్ళ పని అయిపోయేది .చిల్డ్రన్స్ డే కి ఆటల పోటీలు పెడితే ,నాకన్నా ముందు పరిగెత్తవద్దు అని సైగ చేసేది నేను నా ఫ్రెండ్స్ మణిమాల ,లక్ష్మి సరే అని తల ఉపే వాళ్ళం.నాకు ప్రైజ్ తీసుకోవాలని  కోరిక ఉండేది ,కానీ ఏమి చేయలేకఎదాన్ని  .తన ఫ్రెండ్స్ కి కూడా కళ్ళతో వార్నింగ్ ఇచ్చేది .అనిట్లో ఆమె ఫస్ట్ తనకే ప్రైజెస్. ఇంతచేసిన ఫ్రెండ్స్ అందరు ఆమె వెనుకే తిరిగేవాళ్ళు .

 ఇంటి లో కూడా ఆమె చెప్పినట్లే చెయ్యాలి ,లేకపోతె అందరితో పోట్లడేసేది.అమ్మ ,నాన్న లు ముద్దుగా "బెడగుండా రాక్షసి" అనిపిలిచేవాళ్ళకారెంబోర్డ్ ఆటలో ఆమెఓడిపోతుందిఅంటే , అన్ని కలిపేసి వెళ్లి పోయేది .ఓటమి అంగీకరించదు .నా రెండవ తరగతి అల గడిచింది ,కానీ ఇప్పుడు అవి అన్ని తీపి గుర్తులు.

                            పెద్దయ్యాక దాదాగిరి మానేసింది మా పండక్క.లీడర్ క్వాలిటీస్ మాత్రం ఉన్నాయి ,కాలేజీ లో కూడా పదిమంది ఫ్రెండ్స్ వెనక ఉండేవాళ్ళు , లేక్త్చురర్స్ ,స్నేహితులు బాగా ఇష్టపడేవారు .తెలివితేటలూ ఎక్కువని అందరు మెచ్చుకునేవాళ్ళు .


అప్పటిరోజులు తలుచుకుని నవ్వుకుంట వుంటాము .ఇప్పుడు తను బాగా చదువుకుని మంచి జాబ్లో ఉంది.

Sunday, February 14, 2010

ప్రేమ ........

                                                          ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో ......
                       
                                     ప్రేమనేది లేకుండా మనిషి బ్రతకలేడు.తల్లిదండ్రులుగాని  ,తోబుట్టువులుగాని  మనల్ని ప్రేమతో చూడాలని కోరుకుంటాము .కుటుంబములోసరైన  ప్రేమదొరకపోత ,ఎవరైనా బయటవారు అప్యాంగా మాట్లాడితే చాలు  త్వరగా ప్రేమలో పడిపోతారు .
                                       ఈ రోజుల్లో ప్రేమికులు దౌర్జన్యంగ వ్యవహరిస్తున్నారు ,ఒకమ్మయిని ఇష్టపడితే ఆ అమ్మాయి కూడా ఇష్ట పడాల్సిందే,లేకపోతె హతమారుస్తున్నారు .అది నిజంగా ప్రేమేనా ?అది అసూయా ,నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు ,ఉన్మాదులుగా తయారు అవుతున్నారు.
                             ఇంతాచేసి ,పోనీ ఒప్పుకుని పెళ్ళిచేసుకుంటే ,కలకాలం సంతోషంగా జీవిస్తున్నార ?ఈ రోజు పెళ్లి ,సంవస్త్సరం లోపే పెటాకులు .పెద్దలు కూడా వంత పాడుతున్నారు .ఇంకా వాళ్ళకు పుట్టిన పాపానికి బాదితులు వారి పిల్లలు                     
                   నాదృష్టిలో నిజమైన ప్రేమికులు ,చివరిదాకా సంతోషంగా కలసి జీవించినవాళ్ళు.షాజహాన్ ,ముంతాజ్ నిజంగా అద్బుతమైన ప్రేమికులు .పద్నాలుగు మంది పిల్లలు పుట్టిన తరువాత ఆవిడ చనిపోయింది, అప్పటికి వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు .ఆవిడా చనిపోయిన తరువాత తొమ్మిదిరోజులు గది తలుపులు తీయకుండా పచ్చి మంచినీరు కూడా తాగ లేదంట .ఆవిడా ఎంత ప్రేమ అందించకపోతే, షాజహాన్ చివరిరోజుల్లోకుడా తాజ్ మహల్ చూస్తూనే ప్రాణం వదిలేడు.

                           భాగమతి, కులికుతుబ్ ల ప్రేమ కూడా అద్భుతం, నిజమైన ప్రేమికులంటే వీరే .ప్రేమికులందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని చివరివరకు కలిసి  జీవిస్తే బాగుంటుంది .
                            నాకైతే , ఏ జంట విడిపోయిన బాధవేస్తుంది ,జంటలు విడిపోయే సినిమాలను చూడను ,కథలైతే చదవను .
                                

Friday, February 12, 2010

దేవుడున్నాడు !

                                        శివరాత్రి శుభాకాంక్షలతో ....

          
                                        ఆరు ఏళ్ళ క్రితం ,ఒక ఆదివారం ఇంట్లో పని అయిన తరువాత  పన్నెండుగంటలకు కూర్చుని   పుస్తకం చదువుతున్నాను.
                                  
                                            చుట్టూ శూన్యం ఎక్కడ ఉన్నానో అర్ధమవలేదు.అంతట చీకటి అక్కడక్కడ మినుకుమినుక మంటూ చుక్కలు ,చుట్టూ చూస్తే ఎవ్వరు లేరు , అమ్మో! ఎక్కడకు వచ్చెను ?ఎవ్వరు లేరు ,తెలియని చోటికి వచ్చెను  వెళ్లిపోవాలి అని ప్రయత్నిస్తున్న,కానీ వెళ్ళాలని చూస్తే గాల్లో తేలుతున్నాను .భయంతో  చెమటలు పట్టాయి ఇంటిలో అందరిని పేరు పేరు నా  పిలుస్తున్న ఎవ్వరు పలకడం లేదు .పై పైకి వెళ్ళిపోతున్న ,చాల సేపు ప్రయాణం తరువాత తెల్లటి ప్రదేశానికి వచ్చెను .చుట్టూ చల్లగాలి ,అంత మంచు, నడుస్తున్నాను .ఎటునుంచి ఇంటికి వెల్లాల అనే ఆలోచనే !కొంతదూరం నడిచేను ,అంతే! ఎదురుగ శివ పార్వతులు నావైపే చూస్తున్నారు ,నాలో ఆనందం ,భయం ."దయచేసి నన్ను పంపించెయ్యండి ,నాకు అమ్మాయి ఉంది నాకోసం ఎదురు చూస్తా ఉంటది"అటు వైపునుంచి ఉలుకు లేదు పలుకులేదు .వాళ్ళ కాళ్ళ దగ్గకుర్చుని ఒకటే బతిమలుతున్న ,వారు మాత్రం ఏమి మాట్లాడకుండా ప్రసాంతంగా నావైపు చూస్తున్నారు .నాకళ్లలో నీళు,ఇంకా అక్కడనుంచి లేచి వారి చుట్టూ తిరిగి దారి కనపడద్దేమో అని వెతికేను ,ప్చ్ !నిరాశే ఏడుస్తూ మళ్ళి వారి దగ్గరకు వచ్చెను ,నా ప్రాణమంత మా అమ్మయి చుట్టూ ఉంది .మళ్ళి పంపించేయ్యమని బ్రతిమలేను .కొంతసేపటికి మళ్ళి నేను చీకటిలో , సూన్యంలో ఉన్నాను ,గాల్లో ప్రయాణం.


                    ఉలిక్కి పడి చుట్టుచుసేను పుస్తకంనా చేతుల్లోనే ఉంది . టైం చుస్తే ఒంటిగంట దాటింది ,ఒక్కసారే గుండె లబడబ్ చప్పుడు నాకే విన్పించింది టెన్షన్ తో వళ్ళంతా చమటలు పట్టాయి .హమ్మయ్య ! ఇంటిలోనే ఉన్నానా ?అంతా గుర్తు వచ్చింది ఒక్కసారే వళ్ళుజలతరించింది . ఇంటిలో అందరితో చెప్పెను, అచ్చర్య పోయారు.శివపార్వతులు ఎందుకు కన్పించారో నాకు అర్ధమవలేదు !కనీసం నేను తలుచుకోవడం కూద చెసెదన్ని కాదు, నిజంగా శివపార్వతులు మంచుకొండల్లోనే ఉంటారా!చాల కాలం వరకు ఆ దృశ్యాన్ని మర్చిపోలేకపోయా .అప్పటినుంచి ఏదో ఒక సంఘటనలు జరుగుతుండేవి .
 
                                                    * * * *


మా ఇంటిలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి నే పుజిస్తారు .చిన్నప్పుడు ఎక్కువగా తిరుపతి తీసుకు వెళ్ళేవారు ,శివాలయాలకు తక్కువుగా తీసుకు వెళ్ళేవాళ్ళు.శివరాత్రి అప్పుడు మాత్రం తీసుకువెళ్ళేవారు . అందుకేనేమో పెద్దయ్యాక దేవుడంటే వెంకటేశ్వరస్వామి ,షిర్డీ సాయి బాబా నే ఎక్కువగా పూజ చేసేదాన్ని.అందరిలాగే నాకు పెద్ద డైలమ ,అసలు నిజంగా దేముడున్నాడా!ఎప్పుడు నాలో సంఘర్షణ,పైన సంఘటనతో నాకు దేముడున్నాడు అని నమ్మకమేర్పడింది .అప్పటినుంచి శివాలయానికి ప్రతి సోమవారం వెళ్ళటం ,ఏ కష్టమొచ్చిన ఓం నమః శివాయ అనుకోకుండా ఉండలేను .ఏ వూరు వెళ్ళిన శివాలయం వుంటే దర్శించుకుంట .శివుడు నాకు ఇష్ట దైవం అయ్యాడు.ఈ సంవత్స్తరం శివరాత్రి రోజే మా పెళ్లి రోజు కూడా అవడం చాల ఆనందగా వుంది .
                        
          మాములుగా అయితే  ఒక్క పూట కూడా తినకుండా  ఉండలేను .కాని కార్తీకమాసం ,శివరాత్రి కయితే  ఉపవాసము ఉండగలను .ఇదంతా మన సంకల్పబలమేమో !